విద్యా ప్రోత్సాహక స్కాలర్షిప్పులు - పేద మరియు తక్కువ ఆదాయము కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం స్కాలర్షిప్పుల పరిశీలన
శ్రీమిత్ర ఛారిటబుల్ ట్రస్టు పేద మరియు తక్కువ ఆదాయము కలిగిన విద్యార్థుల స్కాలర్షిప్ ల కోసం దరఖాస్తులు ఆసక్తి కలిగిన తరగతి విద్యార్థుల నుండి ఆహ్వానిస్తున్నాము. ట్రస్టు ద్వారా దరఖాస్తుల పరిశీలనానంతరము ట్రస్టు యొక్క విచక్షణా నిర్ణయానుసారముగా విద్యార్థుల ఆర్థిక స్థితి గతులను పరిశీలించి వివిధ మొత్తాలలో గరిష్టంగా రూ. 30,000/- రూపాయల వరకు పరిశీలనలోకి తీసుకోబడును.
అర్హత: (1). పేద, తక్కువ ఆదాయము గల విద్యార్థులు అనగా విద్యార్థుల కుటుంబ ఆదాయము గరిష్టంగా 30,000/- రూపాయలు నెలవారి వరకు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
(2). ప్రభుత్వ అధికారుల, డాక్టర్ల, అడ్వకేట్ల మరియు ఇతర అధిక ఆదాయము అనగా రూ. 30,000/- పై ఆదాయము గల కుటుంబాల పిల్లలు లేక విద్యార్థులు అర్హులు కారు.
ఎంపిక విధానము: (1). ప్రాథమిక ఎంపిక – దరఖాస్తుల తొలి పరిశీలన దీనిలో ఎంపికైన విద్యార్థులకు వారిచ్చిన మొబైలు ద్వారా మెసేజ్ లేక వాట్సాప్ ద్వారా తెలియచేయబడును.
(2) . ట్రస్టు యొక్క విచక్షణ నిర్ణయానుసారంగా మరియు నిధుల లభ్యత ప్రక్రియ తర్వాత స్కాలర్ షిప్పుల పరిశీలన.
దరఖాస్తు : ఉచితము
వెబ్సైట్: https://srimithratrust.com
ఈమెయిల్: srimithratrust.org@gmail.com
నీతి ఆయోగ్, దర్పన్ పోర్టల్ ID(New Delhi) : TS/2023/0676517
ట్రస్టు వద్ద తుది నిర్ణయము తీసుకునే హక్కు ఉంటుంది.